ేశ జాతీయ గేయమైన వందేమాతరాన్ని అవమానించడం లేదా దాని ఆలాపనకు అడ్డు తగలడం ఇకపై చట్టరీత్యా నేరంగా మారుతుంది. ఈ మేరకు ఉద్దేశించిన కీలకమైన ‘జాతీయ గౌరవ పరిరక్షణ (సవరణ) బిల్లు, 2026’కు లోక్సభ గురువారం అధికారికంగా ఆమోదం తెలిపింది.
ప్రతిపక్షాల నుంచి వ్యక్తమైన నిరసనల మధ్యే సభలో మూజువాణి ఓటు ద్వారా ఈ బిల్లు పాస్ అయింది. అంతకుముందు రోజు ఈ బిల్లు ఎగువసభ అయిన రాజ్యసభలో కూడా ఆమోదం పొందడం విశేషం.