జంతర్ మంతర్ వద్ద జరిగిన నిరసనల్లో అరాచక శక్తులు పాల్గొన్నట్లు దిల్లీ పోలీసులు గుర్తించారు. ఆందోళనకారులు ఫేషియల్ రికగ్నిషన్ విశ్లేషణ చేపట్టి పాత కేసులు ఉన్నవారిని గుర్తించినట్లు కథనాలు వస్తున్నాయి. వారిలో 2,783 మందిపై క్రైమ్ రికార్డులు ఉన్నాయి. 101 మందిపై హత్య కేసులు, 62 మందిపై హత్యాయత్నాలు, 284 మందిపై దోపిడీ కేసులు, 61 మందిపై అత్యాచారం ఆరోపణలు, ఆరుగురిపై పోక్సో కేసులు, 25 మందిపై లైంగిక వేధింపుల కేసులు ఉన్నట్లు గుర్తించారు.