అమరావతిలో రెండో విడత భూములిచ్చే రైతుల సాగు రుణమాఫీకి ఏపీ కేబినెట్ ఆమోదం తెలిపింది. భూమి సమీకరించే 7 గ్రామాల రైతులకు రూ.లక్షన్నర వరకు రుణమాఫీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. 2026 జనవరి 6 కంటే ముందు తీసుకున్న రుణాలకు మాఫీ వర్తిస్తుంది. భూములిచ్చిన, ఇవ్వబోయే రైతులకు వార్షిక కౌలు పెంపుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మెట్ట రైతులకు రూ.40 వేలు, జరీబు రైతులకు రూ.60 వేలు కౌలు పెంపుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.