ఖమ్మం జిల్లా ‘రైతు ఆశీర్వాద సభ’లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బీఆర్ఎస్, బీజేపీలపై తీవ్ర విమర్శలు చేశారు. రాబోయే రాజకీయ పోరాటాన్ని కురుక్షేత్ర యుద్ధంతో పోల్చిన ఆయన, కల్వకుంట్ల కుటుంబాన్ని తెలంగాణ రాజకీయాల్లో పూర్తిగా ఓడించే వరకు కాంగ్రెస్ కార్యకర్తలు విశ్రాంతి తీసుకోరని అన్నారు. రాష్ట్రంలో తదుపరి అసెంబ్లీ ఎన్నికలు 2029 మే లేదా జూన్లో జరిగే అవకాశం ఉందని ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ 182 అసెంబ్లీ స్థానాల్లో 117 స్థానాలు గెలిచి వరుసగా రెండోసారి అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు.