శ్రీలంక జైలులో రెండు గ్రూపుల ఖైదీల మధ్య జరిగిన పరస్పర దాడుల్లో మృతుల సంఖ్య 25కి పెరిగింది. మరో 100 మందికి గాయాలయ్యాయి. నెగోంబో పట్టణంలోని కారాగారంలో ఈ ఘటన చోటు చేసుకుంది. జైలులో మాదక ద్రవ్యాల వ్యవహారమే ఈ రెండు గ్రూపుల మధ్య ఘర్షణకు దారి తీసినట్లు స్థానిక మీడియా పేర్కొంది. మరోవైపు జైలు సామర్థ్యానికి మించి ఖైదీలు ఉన్నారని, ఈ క్రమంలోనే వారి మధ్య ఘర్షణ చోటు చేసుకుందన్న వార్తలు కూడా వస్తున్నాయి.