వెనెజువెలాలో బుధవారం సాయంత్రం జంట భూకంపాలలో ,వేలాది మంది శిథిలాల కింద చిక్కుకుపోవడం తెలిసిందే. ఓ ప్రాంతంలో 18 రోజుల పసికందు తల్లితోసహా శిథిలాల కింద చిక్కుకుపోయింది. అక్కడ రెస్కూ సిబ్బంది ఒక్కో సిమెంట్ దిబ్బను తొలగించగా, చివరకు ప్రయత్నం ఫలించి ఆ రోజుల బిడ్డ ప్రాణాలతో కనిపించింది. చిన్నగాయం లేకుండా పాలకోసం ఎదురుచూస్తున్న ఆ బిడ్డను చూసి ప్రతి ఒక్కరి ముఖాల్లో చిరునవ్వులు కనిపించాయి. ఆ తల్లి కూడా సజీవంగా ఉంది.