తెలంగాణలో తొలిసారి దేశీయ క్రికెట్ లీగ్ టోర్నమెంట్ అట్టహాసంగా ప్రారంభమైంది. అట్టహాసంగా నిర్వహిస్తున్న ఈ టోర్నీ ఉప్పల్ స్టేడియంలో ప్రారంభమవగా క్రీడాకారులు సందడి చేశారు. టీజీ 20 లీగ్ 2026 హైదరాబాద్లోని ఉప్పల్ స్టేడియంలో ఆదివారం ప్రారంభమవగా.. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, హాజరవగా.. ఈ టోర్నీ బ్రాండ్ అంబాసిడర్గా ఉన్న స్టార్ హీరో విజయ్ దేవరకొండ టోర్నీని లాంఛనంగా ప్రారంభించాడు. ఈ టోర్నీలో తొలి రోజు పాలమూరు స్ట్రైకర్స్, ఖమ్మం ఏసెస్ జట్ల మధ్య మ్యాచ్ జరిగింది.