లక్నో ఎయిర్పోర్ట్ నుంచి ఢిల్లీ వెళ్లాల్సిన ఇండిగో విమానం (6E2111) లో ఈ భయానక వాతావరణం నెలకొంది. ఆ సమయంలో విమానంలో దాదాపు 180 మంది ప్రయాణికులు ఉన్నారు. ఉదయం 10:45 గంటలకు విమానం రన్వే పైకి వెళ్లాల్సి ఉండగా.. టాయిలెట్లోని ఒక టిష్యూ పేపర్పై చేతిరాతతో కూడిన ఒక నోట్ విమాన సిబ్బంది కంటపడింది. అందులో విమానంలో బాంబు అమర్చినట్లు రాసి ఉండటంతో సిబ్బంది తక్షణమే అలర్ట్ అయి భద్రతా విభాగాలకు సమాచారం అందించారు.