ఇరాన్ తో ఒప్పందంపై ప్రతిష్టంభన కొనసాగుతోంది. దీనిపై అమెరికా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. శ్వేతసౌధంలోని సిట్యుయేషన్ రూమ్లో దాదాపు 2 గంటలపాటు చర్చించిన ట్రంప్.. ఈ డీల్ పై సంతకం చేయకుండానే అక్కడి నుంచి వెళ్లిపోయారు. కానీ, ఒప్పందం చివరి దశకు చేరుకుందని సీనియర్ అధికారులు చెబుతున్నారు. అయితే, ఇరాన్ కు నిధుల విడుదల, అణుకార్యక్రమానికి సంబంధించిన వివాదాలు మాత్రం సమసిపోలేదన్నారు.