జపాన్లో భారీ భూకంపం సంభవించింది. ఆ దేశ దక్షిణ ప్రాంతాన్ని వణికించింది. భూకంప తీవ్రత అనూహ్యంగా ఉండటంతో స్థానిక అధికారులు తీర ప్రాంతాలన్నింటినీ ఖాళీ చేయించారు. బీచ్ లను తాత్కాలికంగా మూసివేశారు జపాన్ దక్షిణ ప్రాంతంలోని కగోషిమా ప్రీఫెక్షర్ సకురాజిమా, నాగసాకీ రీజియన్ లో భారత కాలమానం ప్రకారం ఈ ఉదయం 8:16 నిమిషాలకు భూమి ప్రకోపించింది. రాజధాని టోక్యోకు ఈశాన్యదిశగా 1,351 కిలోమీటర్ల దూరంలోభూకంప కేంద్రంగా గుర్తించినట్లు నేషనల్ సెంటర్ ఫర్ సెస్మాలజీ వెల్లడించాయి.