ఏపీ సీఎం చంద్రబాబు ఇటీవల ఎక్కువ మంది పిల్లల్ని కనాలంటూ ప్రజలకు సూచించిన పాలసీపై ఎంపీ రేణుకా చౌదరి విమర్శలు చేశారు. నాలుగో బిడ్డ పుడితే రూ.40 వేలు ఇస్తామంటూ ప్రభుత్వం పిల్లల్ని కనమంటున్నారు సరే, ఆ పిల్లలకు 20 ఏళ్లు వచ్చాక ఉద్యోగం వస్తుందని ప్రభుత్వం గ్యారెంటీ ఇస్తుందా అని ప్రశ్నించారు. వారి చదువులకు అయ్యే ఖర్చులను ప్రభుత్వం భరిస్తుందా అని నిలదీశారు. ఆ పిల్లల తిండి, మందులు, వారిని పెంచడానికి అయ్యే ఖర్చలును ప్రభుత్వం మోస్తుందా అని ప్రశ్నించారు.