దేశంలో కొందరు నిరుద్యోగులు సోషల్ మీడియాగా, మీడియాగా, సమాచార హక్కు కార్యకర్తల రూపంలో బొద్దింకలు, పరాన్న జీవులాగ మారిపోయి వ్యవస్థలపై చేస్తున్న దాడులపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ (CJI) తీవ్రంగా మండిపడ్డారు. ఓ లాయర్ కు సీనియర్ అడ్వకేట్ హోదా కల్పించే అంశంపై దాఖలైన పిటిషన్ ను విచారిస్తున్న జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జోయ్ మాల్యా బాగ్చీ ధర్మాసనం.. అతని దుష్ప్రవర్తనపై స్పందిస్తూ ఈ వ్యాఖ్యలు చేసింది.