పశ్చిమ బెంగాల్లో రాజకీయ హింస మరోసారి పరాకాష్ఠకు చేరింది. ఉత్తర 24 పరగణాల జిల్లాలోని పానిహతి ప్రాంతంలో బుధవారం అర్ధరాత్రి దాటిన తర్వాత దుండగులు జరిపిన బాంబు దాడిలో ఐదుగురు బీజేపీ కార్యకర్తలు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన జరిగిన ప్రాంతం ఆర్జీ కార్ అత్యాచార బాధితురాలి తల్లి, ప్రస్తుత బీజేపీ ఎమ్మెల్యే రత్న దేబ్నాథ్ నివాసానికి సమీపంలో ఉండటంతో రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర కలకలం రేగుతోంది.