ఆంధ్రప్రదేశ్ ప్రజల చిరకాల కోరిక నెరవేరింది.. ఎట్టకేలకు రాష్ట్ర విభజన సమయంలో ఇచ్చిన హామీని కేంద్రం నిలబెట్టుకుంది. విశాఖపట్నం కేంద్రంగా కొత్తగా దక్షిణ కోస్తా రైల్వే జోన్ను ఏర్పాటు చేస్తూ కేంద్రం గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ కొత్త రైల్వే జోన్ 2026 జూన్ 1 నుంచి అధికారికంగా అమల్లోకి వస్తుందని కేంద్రం పేర్కొంది. విశాఖ జోన్ పరిధిలోకి విశాఖపట్నం, గుంటూరు, విజయవాడ, గుంతకల్లు డివిజన్లు వచ్చేశాయి. ఇకపై దక్షిణ మధ్య రైల్వే పరిధిలో సికింద్రాబాద్, హైదరాబాద్, నాందేడ్ డివిజన్లు మాత్రమే ఉంటాయి.

