దేశంలోని అనేక యూనివర్సిటీలకు ఆంధ్రా యూనివర్సిటీ (ఏయూ) నే దిక్సూచి అని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు తెలిపారు. సోమవారం విశాఖపట్నంలోని ఆంధ్రా యూనివర్సిటీ క్యాంపస్లో శతాబ్ది మహోత్సవాల్లో పాల్గొన్న సీఎం చంద్రబాబు మాట్లాడుతూ.. ఏయూ.. దేశంలోనే టాప్-5 యూనివర్సిటీల్లో ఒకటిగా ఉండాలని ఆయన ఆకాంక్షించారు. ఏయూకు రూ.500 కోట్ల నిధులు ఇస్తామని ఈ సందర్భంగా ప్రకటించారు. మరో రూ.500 కోట్లు కార్పస్ అభివృద్ధి కావాలని పేర్కొన్నారు. వర్సిటీలు మన చారిత్రక సంపద అని అభివర్ణించారు. వాటిని కాపాడుకోవాల్సిన అవసరం ఉందన్నారు.

