ఒకవేళ పశ్చిమ బెంగాల్లో తమ పార్టీ అధికారంలోకి వస్తే, దశాబ్ధాల కాలం నాటి గుర్కా సమస్యను ఆరు నెలల్లో పరిష్కరిస్తామని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా పేర్కొన్నారు. బీజేపీ ఒక్కటే గోర్కా సమస్యను పరిష్కరించగలదని, మరే పార్టీ కూడా ఆ సమస్యను పరిష్కరించలేదన్నారు. డార్జిలింగ్ జిల్లాలోని కుర్సియాంగ్లో జరిగిన ఎన్నికల సభలో మంత్రి షా మాట్లాడారు. గోర్కాల మనోభావాలను, ఆందోళనలను బీజేపీ మాత్రమే అర్థం చేసుకోగలదని, వారికి తగినట్లే ఆ సమస్యను పరిష్కరించగలమని అమిత్ షా తెలిపారు.

