అంతర్జాతీయ వాణిజ్యానికి అత్యంత కీలకమైన హర్మూజ్ జలసంధిలో మరోసారి యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్ (IRGC) బలగాలు ఒక ఆయిల్ ట్యాంకర్పై కాల్పులు జరపడంతో సముద్ర మార్గంలో తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఈ పరిణామంతో రెండు భారత జెండా కలిగిన నౌకలు సహా సుమారు 10 వాణిజ్య నౌకలు తమ ప్రయాణాన్ని ఆపేసి వెనక్కి మళ్లాయి. ఈ ఘటన ఒమన్కు 20 నాటికల్ మైళ్ల దూరంలో శనివారం చోటుచేసుకున్నట్లు యూకే మారిటైమ్ ట్రేడ్ ఆపరేషన్స్ (యూకేఎంటీవో) ధృవీకరించింది.

