మహారాష్ట్రలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. నాందేడ్లో నలుగురు పాఠశాల విద్యార్థులు మురుగు కాలువలో మునిగిపోయారు. ఎనిమిది నుంచి పన్నెండేళ్ల మధ్య వయసున్న ఆ నలుగురు పిల్లలు, పాఠశాల నుంచి ఇంటికి తిరిగి వస్తుండగా ఒక మురుగు గుంతలో ఈత కొట్టడానికి వెళ్లినట్లు సమాచారం. గుంత లోతు తెలియకపోవడంతో, వారు ఒక్కొక్కరుగా మునిగిపోయారు. ఆ మురుగు కాలువ నిర్మాణంలో ఉండగా, కాంట్రాక్టర్ ఈ గుంతను తవ్వినట్లు సమాచారం. ఈ ఘటన అనంతరం, మున్సిపల్ అధికారులు విచారణకు ఆదేశించారు.

