ముంబై మున్సిపల్ కార్పొరేషన్ ఫలితాల అనంతరం కంగనా రనౌత్ మీడియాతో మాట్లాడుతూ ఉద్వేగానికి లోనయ్యారు. “మహారాష్ట్రలో బీజేపీ సాధించిన ఈ అద్భుతమైన విజయం పట్ల నేను చాలా సంతోషంగా ఉన్నాను. “నాడు నన్ను దూషించి, నా ఇంటిని కూల్చివేసి, మహారాష్ట్ర విడిచి వెళ్లాలని బెదిరించిన వారిని.. ఈ రోజు మహారాష్ట్ర ప్రజలే రాష్ట్రం నుంచి వెలేశారు. మహిళలపై ద్వేషం చిమ్మే వారు, బంధుప్రీతి మాఫియాకు జనం సరైన చోటు చూపించినందుకు నాకు గర్వంగా ఉంది” అని ఆమె ఘాటుగా వ్యాఖ్యానించారు.

