జమ్మూ-కాశ్మీర్ లో పోలీసులు కీలకమైన ఆపరేషన్ మొదలుపెట్టారు. తీవ్రవాదానికి అడ్డాగా మారిన ఈ ప్రాంతంలో మసీదుల్ని జల్లెడ పడుతున్నారు. ప్రతి మసీదుకు వెళ్లి, పూర్తి వివరాలు సేకరిస్తున్నారు. ఇందుకోసం నాలుగు పేజీల ఫాంలు రెడీ చేశారు. మసీదుల్లో ఉండే ప్రతి ఒక్కరూ ఈ డాక్యుమెంట్ నింపాల్సి ఉంటుంది. మసీదు పెద్దతోపాటు, ప్రార్థనలు చేయించే వారు, సేవా కార్యక్రమాలు చూసే వారితోపాటు అక్కడికి వచ్చే వారి సంఖ్య, వారి పేర్లు, ఇతర వివరాల్ని కూడా నమోదు చేసుకుంటున్నారు.

