బంగాల్లో జరుగుతున్న ఓటర్ల జాబితా సమగ్ర సవరణ(ఎస్ఐఆర్) ప్రక్రియపై సీఎం మమతా బెనర్జీ కీలక వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల సంఘం నిర్వహిస్తున్న ఆ ప్రక్రియ వల్ల చాలా మంది అనవసర వేధింపులకు గురవుతున్నారని, ప్రాణాలు కోల్పోతున్నారని ఆమె ఆరోపించారు. ఎస్ఐఆర్ మొదలైనప్పటి నుంచి ఇప్పటి వరకు 50 మందికిపైగా ఆత్మహత్య లేదా మానసిక ఆందోళనతో ప్రాణాలు కోల్పోయారని మమత వెల్లడించారు. ప్రజల ఉసురు తీసేలా ఉన్న ఎస్ఐఆర్ పక్షాన తాము నిలిచేది లేదన్నారు. దేశ పౌరసత్వానికి, ఓటు హక్కుకు సంబంధం ఏమిటని దీదీ ప్రశ్నించారు.

