నటుడు ప్రకాష్ రాజ్ చేసిన పోస్ట్ ఆసక్తికరంగా మారింది. ‘వారణాసి’ చిత్రంలో తాను కీలక పాత్రలో నటిస్తున్నట్లు ఆయనే స్వయంగా వెల్లడించారు. సోషల్ మీడియాలో చేసిన పోస్ట్లో, “వారణాసి సినిమా కోసం ఒక అద్భుతమైన షెడ్యూల్ను పూర్తి చేశాము. ఈ పాత్ర నాలోని నటుడి దాహార్తిని తీరుస్తోంది. మహేష్ బాబు, పృథ్వీరాజ్, ప్రియాంక చోప్రా మీతో కలిసి పనిచేయడం ఎంతో ఆనందంగా ఉంది. తదుపరి షెడ్యూల్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను” అని ప్రకాష్ రాజ్ పేర్కొన్నారు.

