బంగ్లాదేశ్లోని భారత దౌత్యవేత్తకు సమన్లు జారీ అయ్యాయి. న్యూ ఢిల్లీ, సిలిగురిలో జరిగిన సంఘటనలను నిరసిస్తూ భారత హైకమిషనర్ను పిలిపించి నిరసన తెలిపింది. భారత్లోని తమ దౌత్య కార్యాలయాలపై జరిగిన దాడులపై బంగ్లాదేశ్ ఆందోళన వ్యక్తం చేసింది. ఈ మేరకు బంగ్లాదేశ్ విదేశాంగ మంత్రిత్వ శాఖ ఓ ప్రకటన విడుదల చేసింది. ‘దౌత్య కార్యాలయాలపై దాడులు, బెదిరింపులను బంగ్లాదేశ్ తీవ్రంగా ఖండిస్తోంది.

