దిగ్గజ పారిశ్రామికవేత్త, టెస్లా అధినేత ఎలాన్ మస్క్కు ఈయూ ఆన్ లైన్ కంటెంట్ నియమాలను ఉల్లంఘించినందుకు ఎక్స్కు 120 మిలియన్ యూరోలు (భారత కరెన్సీలో సుమారు రూ.12,570 కోట్లు) ఫైన్ వేసింది. డిజిటల్ సర్వీసెస్ యాక్ట్ (డీఎస్ఏ) కింద ఎక్స్కు ఈ ఫైన్ను ఈయూ విధించింది. ఈ చట్టం కింద పడిన తొలి జరిమానా ఇదే కావడం గమనార్హం. చట్టవిరుద్ధమైన, హానికరమైన కంటెంట్పై నియమాలను ఎక్స్ ఉల్లంఘించినట్లు తేలడంతో, రెండేళ్ల దర్యాప్తు అనంతరం యూరోపియన్ కమిషన్ జరిమానాను విధించింది.