జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపునకు యూసుఫ్గూడలోని కోట్ల విజయభాస్కర్రెడ్డి స్టేడియం సిద్ధమవుతోంది. అక్కడ పకడ్బందీగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. 42 టేబుళ్లపై 10 రౌండ్లలో ఓట్లు లెక్కించనున్నామని జిల్లా ఎన్నికల అధికారి ఆర్వీ కర్ణన్ తెలిపారు. 120 మంది అధికారులకు విధులు కేటాయించామని తెలిపారు. నియోజకవర్గంలో 4,01,365 మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో 1,94,631 మంది మాత్రమే ఓటు హక్కును వినియోగించుకున్నారు. షేక్పేట, రహ్మత్నగర్ డివిజన్లలో ఎక్కువ ఓట్లు అనేవి ఉన్నాయి. 70 వేల చొప్పున 1.40 లక్షల ఓట్లు ఇక్కడే ఉన్నాయి. .

