స్థానిక సంస్థల ఎన్నికలను పాత పద్ధతిలో నిర్వహిస్తామంటే ఒప్పుకునే ప్రసక్తే లేదని బిసి జెఎసి చైర్మన్, రాజ్యసభ సభ్యులు ఆర్. కృష్ణయ్య అన్నారు. పార్టీ పరంగా రిజర్వేషన్ల అమలుకు అంగీకరించ బోమని ఆయన ఒక ప్రకటనలో స్పష్టం చేశారు. మరో రెండు నెలలు వాయిదా పడితే ఏమవుతుందన్నారు. మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల్లో ఎన్నికలు నాలుగేళ్లు వాయిదా పడ్డాయని గుర్తు చేశారు. బిసిలకు 42 శాతం రిజర్వేషన్ల కోసం ప్రత్యేక తెలంగాణ ఉద్యమం తరహా ఉద్యమాలు చేస్తామని కృష్ణయ్య హెచ్చరించారు.

