ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అక్రమ నిర్మాణాల క్రమబద్ధీకరణ (BPS) పథకానికి మరోసారి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు ప్రభుత్వం చట్టాన్ని సవరించి గెజిట్ విడుదల చేసింది. 2019లో రాష్ట్రం బిల్డింగ్ పెర్మిషన్ స్కీమ్ (BPS) ద్వారా 2018 ఆగస్టు 31 వరకు ఉన్న నిర్మాణాలను క్రమబద్ధీకరించడానికి అవకాశం కల్పించింది. తాజాగా ప్రభుత్వం కొత్త గెజిట్ ప్రకారం, ఈ నిర్మాణాల క్రమబద్ధీకరణకు కటాఫ్ తేదీని 2025 ఆగస్టు 31 వరకు పొడిగించింది. అంటే ఆ తేదీ లోపల నిర్మాణం పూర్తయిన వాటికి క్రమబద్ధీకరణ అవకాశం లభిస్తుంది.

