
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఆంధ్రప్రదేశ్లోని పౌరులందరికీ హెల్త్ ఇన్సూరెన్స్ కల్పించనుంది. ఈ మేరకు మంత్రివర్గ సమావేశంలో ఈ ప్రతిపాదనకు గ్రీన్ సిగ్నల్ లభించింది. యూనివర్సల్ హెల్త్పాలసీని అంగీకరించారు. ఇందులో ఎన్టీఆర్ వైద్య సేవతోపాటు అన్ని కూడా ఇందులో ఇంక్లూడ్ అయ్యి ఉంటాయి. ఆర్థిక స్థితిగతులతో సంబంధం లేకుండా అందరికీ హెల్త్ పాలసీ అమలుకు నిర్ణయించారు. ఆయుష్మాన్ భారత్-ఎన్టీఆర్ వైద్యసేవ పథకం కింద యూనివర్సల్ హెల్త్ పాలసీ ఉంటుంది.