భారత నావికాదళంలో మరో రెండు అధునాతన స్టెల్త్ గైడెడ్ క్షిపణి యుద్ధనౌకలు చేరాయి. మంగళవారం విశాఖపట్నంలో రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ నేతృత్వంలో జరిగిన కార్యక్రమంలో ఉదయగిరి, హిమగిరి యుద్ధనౌకలను అధికారికంగా నావికాదళంలో చేర్చారు. రెండు నౌకలు ఒకేసారి జాతికి అంకితం చేయడం ఇదే తొలిసారి. ఉదయగిరి, హిమగిరి ‘ప్రాజెక్ట్ 17 (శివాలిక్)’ తరగతి నౌకల కొత్త వెర్షన్లు. వీటిలో స్టెల్త్ అంటే రాడార్ నుండి తప్పించుకోగల సామర్థ్యం, ఆయుధం, సెన్సార్ వ్యవస్థలలో గణనీయమైన మెరుగుద ఉన్నాయి.

