సెప్టెంబర్ 1 నుంచి ఏపీలో నూతన బార్ పాలసీ అమలు చేయనున్నట్లు సీఎం చంద్రబాబు తెలిపారు. ఏపీ బార్ల లైసెన్సుల్లో పది శాతం గీత కార్మికులకు కేటాయించనున్నారు. ఈ మేరకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం రాష్ట్రంలో 840 బార్లు ఉండగా ఆ సంఖ్యను వెయ్యికి పైగా పెంచాలనే ఆలోచన ప్రభుత్వం చేస్తోంది. కల్లు గీత కార్మికులకు కేటాయించే బార్ల లైసెన్స్ ఫీజును తక్కువగా నిర్ణయించే అవకాశాలు ఉన్నాయి.

