loader

కుంకీ ఏనుగుల తొలి ఆపరేషన్ విజయవంతం..డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్

రాష్ట్రంలో ఆపరేషన్ కుంకీ మొదలైందని… కుంకీ ఏనుగులు ద్వారా చేపట్టిన తొలి ఆపరేషన్ విజయవంతమైందని తెలిపారు. ఈ మేరకు పవన్ కల్యాణ్ కార్యాలయం ఒక ప్రటకన విడుదల చేసింది. చిత్తూరు జిల్లా బంగారుపాళ్యం మండల పరిధిలోని మొగిలి వద్ద మామిడి తోటలను ధ్వంసం చేస్తున్న అటవీ ఏనుగుల గుంపుని కుంకీలు విజయవంతంగా దారి మళ్లించి అడవిలోకి తరిమికొట్టినట్టు అటవీ శాఖ అధికారులు చెప్పారని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు

లక్కీ జాకెట్‌ వేసుకున్నా.. టీమిండియా గెలిచింది

టీమిండియాకు సూపర్ విక్టరీ కామెంటరీ బాక్స్‌లో ఉన్న సునీల్ గవాస్కర్ అయితే గట్టిగా ఆరుస్తూ విజయాన్ని ఎంజాయ్ చేశాడు ‘రేపు నేను నా లక్కీ జాకెట్ వేసుకొని వస్తాను. ఆ జాకెట్‌ను ఆస్ట్రేలియా పర్యటనలో గబ్బా టెస్టులో వేసుకున్నా. ఈసారి మీ కోసం ఆ జాకెట్‌తో వస్తాను. ఆల్‌ ది బెస్ట్. ఆ దేవుడి ఆశీస్సులు మీకు ఉంటాయి’ అని ఓవల్ టెస్టు మూడోరోజు గవాస్కర్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్‌తో మాట్లాడుతూ తన లక్కీ జాకెట్ గురించి […]

ఆధారాలు చూపడంలో సీబీఐ విఫలం.. అవినీతి కేసు నుంచి మాజీ మంత్రికి విముక్తి

ఆమ్ ఆద్మీ పార్టీ మాజీ మంత్రి సత్యేంద్ర జైన్‌కు భారీ ఊరట లభించింది. అవినీతి ఆరోపణల కేసులో మూడేళ్ల క్రితం ఆరెస్ట్ అయిన ఆయనకు సోమవారం కోర్టు క్లీన్‌చీట్ ఇచ్చింది. తగిన ఆధారాలను సమర్పించడంలో కేంద్ర దర్యాప్తు సంస్థ (CBI) విఫలమైందని తెలిపిన కోర్టు కేసును కొట్టివేసింది. దాంతో, కొన్నాళ్లుగా అవినీతి కేసులో జైలు పాలైన ఆయనకు విముక్తి దొరికింది.

భారీ వర్షాలపై ముఖ్యమంత్రి సమీక్ష..

రాష్ట్రంలో భారీ వర్షాల నేపథ్యంలో అన్ని జిల్లాల కలెక్టర్లు, అన్ని శాఖ‌ల అధికారులు అప్రమత్తంగా ఉండాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్ర సచివాల‌యంలో ఉన్నతాధికారుల‌తో ముఖ్యమంత్రి ప్రత్యేకంగా  మాట్లాడారు. జీహెచ్ఎంసీతో పాటు రాష్ట్రవ్యాప్తంగా వరద నీటి ఉధృతి ఉన్న ప్రాంతాల్లో ప్రజలను అప్రమత్తం చేయాలని అధికారుల‌కు సీఎం సూచించారు. రానున్న రెండు మూడు రోజులు వ‌ర్షాలు ఉంటాయ‌నే స‌మాచారం ఉన్నందున కలెక్టర్లు జిల్లాల్లోని అన్ని విభాగాలతో ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షించాలని ఆదేశించారు.

కేవలం 2 గంటల్లోనే 151 మి.మీ వర్షమా..

హైదరాబాద్ లో దాదాపు రెండుమూడు గంటలు ఎడతెరిపి లేకుండా వర్షం కురిసింది. దీంతో నగరవ్యాప్తంగా ట్రాఫిక్ జామ్స్ అవుతున్నాయి. ప్లైఓవర్లపై వాహనాలు నిలిచిపోయాయి. అటు పాతబస్తీ నుండి ఇటు హైటెక్ సిటీ వరకు… సికింద్రాబాద్ నండి సిటీ ఔట్ స్కట్స్ వరకు భారీ వర్షం కురిసింది. అత్యధికంగా కుత్బుల్లాపూర్ లో 151 మిల్లిమీటర్లు, బంజారాహిల్స్ లో 125 మి.మీ, జూబ్లీహిల్స్ లో 74 మి.మీ, మెహదీపట్నంలోబ 53 మి.మీ, ఖైరతాబాద్ లో 36 మి.మీ, మైత్రివనంలో 34 […]

బార్ల లైసెన్సుల్లో గీత కార్మికులకు పది శాతం రిజర్వేషన్

సెప్టెంబర్ 1 నుంచి ఏపీలో నూతన బార్ పాలసీ అమలు చేయనున్నట్లు సీఎం చంద్రబాబు తెలిపారు. ఏపీ బార్ల లైసెన్సుల్లో పది శాతం గీత కార్మికులకు కేటాయించనున్నారు. ఈ మేరకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం రాష్ట్రంలో 840 బార్లు ఉండగా ఆ సంఖ్యను వెయ్యికి పైగా పెంచాలనే ఆలోచన ప్రభుత్వం చేస్తోంది. కల్లు గీత కార్మికులకు కేటాయించే బార్ల లైసెన్స్ ఫీజును తక్కువగా నిర్ణయించే అవకాశాలు ఉన్నాయి.

మా కోడలు తెలంగాణ స్పోర్ట్స్ హబ్‌‌కు కో-ఛైర్‌పర్సన్‌ అయ్యింది.. మెగాస్టార్ ఆనందం

మా కోడలు తెలంగాణ స్పోర్ట్స్ హబ్‌‌కు కో ఛైర్మన్‌ అయ్యింది అంటూ చిరంజీవి… ” గౌరవనీయమైన పదవికి ఉపాసన కొణిదెల నియామకం పట్ల ఆనందంగా ఉంది. ఇది ఒక గౌరవం, గొప్ప బాధ్యత కూడా. డియర్‌ ఉపాసన.. మీకున్న నిబద్ధత, ప్యాషన్‌తో క్రీడల్లో దాగి ఉన్న అపార ప్రతిభను గుర్తించి ప్రోత్సహిస్తారని, ప్రతిభావంతులను అగ్ర స్థానంలో నిలబెట్టడానికి తగిన విధి విధానాలను రూపొందించడంలో నీ వంతు కృషి చేస్తావని ఆశిస్తున్నాను. నీకు ఆ దేవుడు అశీసులు తోడుగా […]

కెసిఆర్ అవకతవకలకు పాల్పడ్డారు- ఉత్తమ్

“కేసీఆర్ డిజైన్లు మార్చడం వల్లే ప్రజాధనం దుర్వినియోగమైనట్లు ఘోష్ కమిషన్ తేల్చిందని” ఉత్తమ్ సంచలన ఆరోపణలు చేశారు. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల పునాదుల్లోనే సమస్య ఉందని కమిషన్ నివేదికలో స్పష్టంగా పేర్కొన్నట్లు ఆయన తెలిపారు. అంతేకాకుండా, రుణాలు తీసుకోవడంలోనూ కేసీఆర్ అవకతవకలకు పాల్పడ్డారని ఉత్తమ్ ఆరోపించారు. ఈ నివేదికలో మాజీ మంత్రి హరీష్ రావు ప్రస్తావన తొమ్మిది సార్లు ఉందని ఆయన వెల్లడించారు.

బిఆర్ఎస్ కు గువ్వల బాలరాజు రాజీనామా

తెలంగాణ రాజకీయాల్లో అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. అచ్చంపేట నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు భారత్ రాష్ట్ర సమితి (BRS) పార్టీకి రాజీనామా చేశారు. ఈ మేరకు తన రాజీనామా లేఖను పార్టీ అధినేత కె. చంద్రశేఖర్ రావుకు పంపారు. బాలరాజు రాజీనామా తెలంగాణలో రాజకీయ వర్గాల్లో విస్తృత చర్చకు దారితీసింది. ఆయన బీజేపీలో చేరతారని విస్తృతంగా ప్రచారం జరుగుతోంది.

విదేశీ విద్య కోసం భారీగా రుణాలు చేయవద్దు: జోహో వ్యవస్థాపకుడు

విదేశాల్లో ఉన్నత విద్య అభ్యసించాలనే కలలు కంటున్న భారతీయ విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు ప్రముఖ టెక్ సంస్థ జోహో వ్యవస్థాపకుడు శ్రీధర్ వెంబు కీలక హెచ్చరికలు జారీ చేశారు. ముఖ్యంగా అమెరికా లో చదువుల కోసం పెద్ద మొత్తంలో విద్యా రుణాలు తీసుకోవడంలో ఉన్న ప్రమాదాల గురించి ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ప్రస్తుతం అమెరికాలో ఉద్యోగ మార్కెట్ చాలా బలహీనంగా ఉందని, ఇమ్మిగ్రేషన్ పరమైన సవాళ్లు కూడా పెరిగాయని ఆయన స్పష్టం చేశారు.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON