
భారత ప్రధాన మంత్రి నరేంద్రమోదీ యూకే పర్యటన సందర్భంగా యూకే ప్రధాని కీర్ స్టార్మర్తో మోదీ భేటీ అయ్యారు. ఈ భేటీలో రెండు దేశాల మధ్య కీలక ట్రేడ్ డీల్ కుదిరింది. భారత్-యూకేల మధ్య చారిత్రక స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందంపై ఇరుదేశాలూ సంతకాలు చేశాయి. ప్రధాని మోదీ, యూకే ప్రధాని కీర్ స్టార్మర్ సమక్షంలో ఇదరుదేశాల వాణిజ్య శాఖ మంత్రులు ఈ ఒప్పందంపై సంతకాలు చేశారు.