కాంగ్రెస్ పార్టీకి పెద్ద షాక్ తగిలింది. తమ పార్టీకి విరాళంగా వచ్చిన రూ.199 కోట్ల డబ్బుపై పన్ను మినహాయంపు కోసం చేస్తున్న ప్రయత్నం బెడిసికొట్టింది. మంగళవారం ఆదాయ పన్ను అప్పిల్లేట్ ట్రిబ్యునల్ ఆ పార్టీ అప్పీల్ను తిరస్కరించింది. గతంలో ఆదాయ పన్ను అధికారులు తీసుకున్న నిర్ణయాన్నే ట్రిబ్యునల్ సమర్ధించింది. ఎట్టి పరిస్థితుల్లోనూ కాంగ్రెస్కు రిలీఫ్ ఇవ్వబోమని తేల్చి చెప్పింది. దాంతో, ఏం చేయాలో తెలియక తలలు పట్టుకుంటున్నారు కాంగ్రెస్ నేతలు.

