
ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ను నల్లపాడు పోలీసులు నోటీసులు జారీ చేశారు. సింగయ్య మృతి కేసును దర్యాప్తు చేస్తున్న పోలీసులు ఈ కేసులో ఏ2గా ఉన్న వైఎస్ జగన్కు నోటీసులు ఇవ్వాలని నిర్ణయించారు. ఈ క్రమంలోనే తాడేపల్లిలోని వైసీపీ కార్యాలయానికి వెళ్లిన పోలీసులు… అక్కడ పార్టీ కార్యాలయ ప్రధాన కార్యదర్శి అప్పిరెడ్డికి నోటీసు అందజేశారు. అలాగే సింగయ్య మృతి కేసు విచారణలో భాగంగా… ప్రమాదానికి కారణమైనట్టుగా చెబుతున్న వాహనాన్ని కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.