
రాష్ట్రంలో వ్యర్ధాల నిర్వహణ వ్యవస్థను పటిష్టపరిచేలా… రెండు నెలల్లో సర్క్యులర్ ఎకానమీకి సంబంధించి తుది పాలసీని తీసుకురావాలని, అక్టోబర్ 2 కల్లా రాష్ట్రంలోని విశాఖపట్నం, విజయవాడ, తిరుపతి, రాజమండి… 4 నగరాలతో పాటు మరో 17 కార్పొరేషన్లలో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ పూర్తిగా అరికట్టాలని, 90 రోజుల్లోగా రీసైక్లింగ్, చెత్తను వేరు చేయడంపై కార్యాచరణ ప్రణాళిక ఇవ్వాలన్నారు. మంగళవారం సచివాలయంలో సర్క్యులర్ ఎకానమీపై అధికారులతో ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు.