
రాష్ట్రంలోని రైతులకు వర్షకాలంలో పెట్టుబడి సాయం కింద అందించే రైతు భరోసా నిధులను విడుదల చేసింది. తెలంగాణ ప్రభుత్వం ప్రవేశ పెట్టిన పథకాలలో రైతు భరోసా ఒకటి. కాంగ్రెస్ ప్రభుత్వం ఈ పథకం రాష్ట్రంలోని రైతులకు పెట్టుబడి సాయం కింద ఏడాదికి రూ.12వేలు రెండు విడతలుగా అందజేస్తుంది. రైతు నేస్తం కార్యక్రమంలో స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి ఆన్లైన్లో బటన్ నొక్కి రెండు ఎకరాల వరకు భూమి ఉన్న రైతుల బ్యాంకు ఖాతాల్లో నిధులు జమ చేశారు.