గోదావరిలో స్నానానికి దిగి ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు యువకులు ప్రాణాలు కోల్పోయారు. ఈ విషాద సంఘటన నిర్మల్ జిల్లా బాసరలో చోటుచేసుకుంది. హైదరాబాద్ కు చెందిన ఓ కుటుంబం గోదావరిలో పుణ్యస్నానాల కోసం బాసరకు వచ్చినట్లు తెలుస్తోంది. మొత్తం 18 మంది కుటుంబ సభ్యులు.. పుణ్యస్నానాలకు రాగా, వారిలో ఐదుగురు నీటిలో మునిగి మృతి చెందారు.

