జూన్ నెలలోనే అన్నదాత సుఖీభవ పథకం అమలు చేయనున్నట్టుగా సీఎం చంద్రబాబు ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా గురువారం రోజున సీఎం చంద్రబాబు మాట్లాడుతూ… ఈ నెల 20న అన్నదాత సుఖీభవ పథకం అమలు చేస్తామని తెలిపారు. రైతులకు ఏడాదిలో కేంద్రం (పీఎం కిసాన్ యోజన) ఇచ్చే రూ. 6 వేలకు మరో 14 వేల రూపాయలు కలిపి… రూ. 20 వేలు వారి ఖాతాల్లో వేస్తామని చెప్పారు.

