
నారా లోకేష్ రాజీనామా చాలెంజ్ విసిరారు. పోటీగా జగన్ రాజీనామా చేయాల్సింది లేదని క్షమాపణ చెబితే చాలన్నారు. జగన్మోహన్ రెడ్డి ఉర్సా కంపెనీలు రూపాయికి ఎకరం భూములు ఇచ్చారని ఆరోపిస్తున్నారు. అది నిజం కాదని మార్కెట్ రేటుకే ఇచ్చామని నారా లోకేష్ అంటున్నారు. ఓ సారి క్లారిటీ ఇచ్చినా జగన్ ఆపకపోవడంతో ఆరోపణలు నిరూపిస్తే నేను నా మంత్రి పదవికి రాజీనామా చేస్తాను. మీరు చేసిన ఆరోపణలు తప్పని తేలితే రాష్ట్ర యువతకు క్షమాపణ చెప్పండి చాలు.