
సికింద్రాబాద్ రైల్వేస్టేషన్లో నేరగాళ్లకు చెక్ పెట్టేందుకు రైల్వేశాఖ అత్యాధునిక ‘ఫేషియల్ రికగ్నిషన్ కెమెరాలను’ ఏర్పాటు చేయనుంది. సికింద్రాబాద్ స్టేషన్లో, ఈ అధునాతన నిఘా వ్యవస్థ అందుబాటులోకి రానుంది. నేరాల దర్యాప్తులో నేరగాళ్ల కదలికలు అత్యంత కీలకం. నేరం చేసినవారు లేదా నేరచరిత్ర ఉన్నవారు రైల్వేస్టేషన్ల ద్వారా పారిపోయేందుకు ప్రయత్నిస్తే, వారిని గుర్తించి పట్టుకోవడంలో ఈ కెమెరాలు ఎంతో ఉపయోగపడతాయి.