
ప్రకాశం జిల్లా కొమరోలు మండలం తాటిచెర్లమోటు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆరుగురు మృతి చెందారు. బాపట్ల జిల్లా స్టూవర్టపురం వాసులు మహానంది వెళ్లి వస్తుండగా ప్రమాదం జరిగింది. భక్తులు ఉన్న కారు లారీని ఢీ కొట్టడంతో దుర్ఘటన జరిగింది. 8 మంది మహానంది వెళ్లి వస్తుండగా లారీని ఢీ కొట్టారు ఈ దుర్ఘటనలో స్పాట్లోనే ఆరుగురు మృతి చెందారు. మరో ఇద్దరు తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.
- 0 Comments
- Bapatla District
- Prakasam District