
ఈ ఏడాది ఫిబ్రవరిలో రాష్ట్రంలో బీర్ల ధరలు పెరిగిన సంగతి తెలిసిందే… అయితే ఇప్పుడు తాజాగా లిక్కర్ ధరల పెంపునకు గ్రీన్ సిగ్నల్ లభించినట్టుగా తెలుస్తోంది. విస్కీ, బ్రాందీ క్వార్టర్పై రూ.10, ఆఫ్ బాటిల్పై రూ.20, ఫుల్ బాటిల్పై రూ.40 చొప్పున ధరలు పెరగనున్నాయి. ఈ మేరకు జారీ చేసిన సర్క్యూలర్లో ఎక్సైజ్ శాఖ పేర్కొన్నట్టుగా వార్తలు వస్తున్నాయి. ఈ పెరిగిన ధరలు ఈ నెల 19 నుంచి అమలులోకి వస్తాయని ఎక్సైజ్ శాఖ ఉత్తర్వుల్లో పేర్కొన్నట్టుగా తెలుస్తోంది.