
ఐపిఎల్ సీజన్ 2025ను భారత క్రికెట్ బోర్డు (బిసిసిఐ) మ ధ్యలోనే నిలిపి వేసింది. అయితే యుద్ధ మేఘాలు తొలగిపోయి ఇరు దేశాల మధ్య సయోధ్య కుదరడంతో ఐపిఎల్ను తిరిగి నిర్వహించాలని బిసిసిఐ నిర్ణయించింది. ఆగిపోయే సమయానికి హైదరాబాద్లోని ఉప్పల్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో మూడు మ్యాచ్లు జరగాల్సి ఉంది. ఇందులో ఒకటి లీగ్ మ్యాచ్ కాగా, మరో రెండు ప్లేఆఫ్ మ్యాచ్లు ఉన్నాయి. కానీ, తాజా షెడ్యూల్లో హైదరాబాద్కు ఒక్క మ్యాచ్ కూడా కేటాయించలేదు.