
తిరుమల శ్రీవారి దర్శనం కోసం ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు ఇచ్చే సిఫారసు లేఖలను అనుమతించాలని టీటీడీ నిర్ణయించింది. ప్రస్తుతం ఈ సిఫారసు లేఖలను తాత్కాలికంగా పక్కనపెట్టిన విషయం తెలిసిందే. ఈ నెల 15 నుంచి లేఖలను తిరిగి అనుమతించాలని టీటీడీ నిర్ణయం తీసుకున్నది. మరోవైపు 10,01,115 సార్లు గోవింద కోటి రాసిన వారికి వీఐపీ బ్రేక్ దర్శనం కల్పించనున్నారు గోవింద కోటి పూర్తి చేసిన వారు ఆ పుస్తకాలను తిరుమలలోని టీటీడీ పేష్కార్ కార్యాలయంలో అందిస్తే మరుసటి రోజు వీఐపీ బ్రేక్ దర్శనం కల్పిస్తారు.