
అయోధ్య నగరం ఈ దీపావళి వేళ చరిత్ర సృష్టించింది. భక్తుల సందడి, దీపాల కాంతి, సరయూ నదీ తీరంలోని ఆ భవ్య దృశ్యం ఆకట్టుకుంటుంది. ఆధ్యాత్మిక, సాంస్కృతిక, సామాజిక, సాంకేతికతల మేళవింపుతో అంగరంగ వైభవంగా.. 9వ దీపోత్సవం కనుల పండువగా సాగింది. 56 ఘాట్లలో ఏకంగా 26 లక్ష 11 వేల 101 దీపాలను వెలిగించారు. 2 వేల వంద మందితో సరయూ నదీ తీరాన మహా హారతి నిర్వహించారు. 1,100 డ్రోన్లతో రామాయణ ఘట్టాలను కళ్లకు కట్టారు. బాలకాండం నుంచి ఉత్తరకాండం వరకు ఏడు కాండాల ప్రదర్శనకు ప్రత్యేక శకటాలు ఏర్పాటు చేశారు.