మెట్రోలో ట్రాన్స్జెండర్లకు సెక్యూరిటీగా విధులు
ట్రాన్స్ జెండర్ల ఉపాధి విషయంలో శ్రధ్ద కనబరుస్తున్న రాష్ట్ర ప్రభుత్వం తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే ట్రాఫిక్ అసిస్టెంట్స్గా ట్రాన్స్జెండర్లను నియమించిన రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు హైదరాబాద్ మెట్రో రైళ్లలో సెక్యూరిటీ గార్డులుగా నియమించింది. సెక్యూరిటీ గార్డు నియామకాల కోసం దాదాపు 300- నుండి 400 మంది దరఖాస్తు చేసుకోగా, నైపుణ్యం కలిగిన వారిని ఎంపిక చేశామని తెలిపారు. ట్రాన్స్జెండర్ల భవిష్యత్తుకు ప్రభుత్వం అండగా నిలుస్తుందని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ భరోసా ఇచ్చారు.

