రష్యా అధ్యక్షుడు పుతిన్ ఈ ఏడాది సెప్టెంబరులో భారత పర్యటనకు రానున్నారు. క్రెమ్లిన్ ప్రతినిధి యూరీ ఉషకొవ్ ఈ విషయాన్ని వెల్లడించారు. దిల్లీ వేదికగా సెప్టెంబరు 12-13వ తేదీల్లో జరగనున్న బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సులో పుతిన్ పాల్గొంటారని తెలిపారు. పుతిన్ చివరిసారి గతేడాది డిసెంబరులో భారత్లో పర్యటించారు.