విజయవాడ నగరంలో జాతీయ దర్యాప్తు సంస్థ (NIA) అధికారులు సోదాలు నిర్వహించడం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఒక టెర్రర్ లింక్స్ కేసు దర్యాప్తులో భాగంగానే విజయవాడలో ఈ తనిఖీలు చేపట్టినట్లు తెలుస్తోంది. వించిపేటలోని సదరు అనుమానితుల నివాసాలు, కార్యాలయాల్లో అధికారులు అణువణువూ గాలిస్తున్నారు. ఈ సోదాల్లో భాగంగా పలు కీలక పత్రాలను, అలాగే లాప్టాప్లు, మొబైల్ ఫోన్లు వంటి డిజిటల్ ఆధారాలను ఎన్ఐఏ అధికారులు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు.