ఇప్పటి వరకు జాతీయ గీతం ‘జనగణమన’కు మాత్రమే ప్రత్యేక చట్టపరమైన రక్షణ ఉండేది. కేంద్ర ప్రభుత్వం 1971లో అమల్లోకి వచ్చిన ప్రివెన్షన్ ఆఫ్ ఇన్సల్ట్స్ టు నేషనల్ హానర్ చట్టంలో సవరణలు చేసి, వందే మాతరాన్ని కూడా అదే చట్ట పరిధిలోకి తీసుకొచ్చింది.
రాష్ట్రపతి ఆమోదంతో ఈ సవరణ చట్టంగా అమల్లోకి వచ్చింది. ఇకపై వందే మాతరం పాటను ఉద్దేశపూర్వకంగా అడ్డుకోవడం, ఆటంకం
కలిగించడం లాంటి చర్యలకు గరిష్ఠంగా మూడు సంవత్సరాల జైలు శిక్ష, లేదా జరిమానా, లేదా రెండూ విధించే అవకాశం ఉంటుంది.