భారతదేశ జాతీయ గేయమైన ‘వందేమాతరం’పై ప్రముఖ బాలీవుడ్ సీనియర్ నటి షర్మిలా టాగూర్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. దేశంలోని వివిధ మతాల ప్రజల మనోభావాలను దృష్టిలో ఉంచుకుని.. ఇంతకుముందు కొనసాగించినట్లే ఈ గేయంలోని కేవలం మొదటి రెండు చరణాలను మాత్రమే అధికారికంగా ఉంచాలని ఆమె సూచించారు. ‘వందేమాతరం’ పూర్తి గీతంలో వివిధ దేవతల ప్రస్తావన వచ్చే చరణాలు ఉంటాయని, ఏకేశ్వరోపాసనను నమ్మే ఇతర మతస్తులకు ఆ పదాలను పలకడం లేదా ఆలపించడం కొంత ఇబ్బందికరంగా మారుతుందని ఆమె వివరించారు.